తిరుమల సమాచారం… ఓం నమో వేంకటేశాయ…!

ఈ రోజు సోమవారం,

26.08.2019 ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల: 21C° – 29℃°

నిన్న 85,004 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది, స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 01 గదులలో భక్తులు చేచియున్నారు, ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును నిన్న 33,878 మంది భక్తులు స్వామి వారికి   తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 4.13 కోట్లు, శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును, వయోవృద్దులు మరియు దివ్యాంగుల ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు, చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా:  కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి

 

TTD Toll Free  No 18004254141

 

About The Author