పవన్కళ్యాన్ కి కాపులను బీసీల్లో కలిపే అంశంపై అవగాహన లేకపోవడం హాస్యాస్పదం…


పవన్కళ్యాన్ కి కాపులను బీసీల్లో కలిపే అంశంపై
అవగాహన లేకపోవడం హాస్యాస్పదం.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదికారం చేపట్టిన వంద రోజుల్లోనే పందొమ్మిది చారిత్రక బిల్లులు తెచ్చిన విషయం జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు తెలియదా అని కాపు కార్పొరేషన్ చైర్మన్ ,ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ఒకపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న పవన్‌కు కాపులను బీసీల్లో కలిపే అంశంపై అవగాహన లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం కోసం ఈబీసీ కోటాలో ఐదుశాతం రిజర్వేషన్ ను తీసుకుంటే … రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్ధేశ్యంతో సీఎం జగన్‌ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు రాజా వివరించారు.

About The Author