శారద పీఠానికి భూమి కేటాయించడంపై హై కోర్ట్ సీరియస్..!


కోట్ల విలువ గల భూమి.. రూపాయికే ఎకరం చొప్పున అమ్మకం.
చౌకగా అమ్మడానికి గల కారణాలు తెలపాలని నోటీసుల జారీ
? హైదరాబాద్​లో అత్యంత చౌక ధరకు భూమిని విశాఖ శారద పీఠానికి కేటాయించడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
? కేవలం రూపాయికి ఎకరం చొప్పున కోట్ల విలువైన భూమిని కేటాయించడంపై ప్రభుత్వం వైఖరి ఏంటో తెలపాలని సర్కారుకు నోటీసులు జారీ చేసింది.
? హైదరాబాద్​లోని కోకాపేటలో విశాఖ శారదపీఠానికి రూపాయికి ఎకరం చొప్పున.. రెండు ఎకరాలను కేటాయిస్తూ జూన్ 22న ప్రభుత్వం జీవో 71 జారీ చేసింది. జీవోను సవాల్ చేస్తూ *సికింద్రాబాద్ లాలాపేట్​కు చెందిన సీహెచ్ వీరాచారి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
? కోకాపేటలో భూముల మార్కెట్ విలువ కోట్ల రూపాయలు ఉన్నదని… అయితే చట్టవిరుద్ధంగా కేవలం ఒక్క రూపాయికే ఎకరం కేటాయించారని ఆరోపించారు.
? ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసి.. భూ కేటాయింపులు రద్దు చేయాలని కోరారు.
? స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
? రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్​తో పాటు.. శారదపీఠం ధర్మాధికారికి నోటీసులు జారీ చేసింది.

About The Author