ప్రజలందరూ వ్యతిరేకించిన చోట మద్యం షాపు ఏర్పాటు చెయ్యద్థు

చిత్తూరు జిల్లా: రేణిగుంట 2017 లో మద్యం షాపు మసీదుకు దగ్గరగా, నివాస ప్రాంతమైన బుగ్గవీది ప్రాంతంలో ఏర్పాటు చేయగా ప్రజలు ముస్లిం పెద్దలు,మహిళలు, వైసిపి, టిడిపి, సిపియం, సిపిఐ అఖిల పక్ష ఆధ్వర్యంలో 15 రోజులు పోరాడగా మద్యం షాపును ఎత్తేసారు

అదే స్థలంలో పభుత్వ మద్యం దుకాణం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అభ్యంతరం చెప్పని అనేక స్థలాలు ఉన్నా ఇక్కడ ఏర్పాటు చేయాలనడం న్యాయంకాదు

ముస్లిం పెద్దలు వినతిపత్రం సమర్పించారు. శ్రీకాళహస్తి ఎంఎల్ఏ గారు కూడా అక్కడ మద్యం దుకాణం పెట్టవద్దని తెలిపారు. మద్య నియంత్రణ కోసం ప్రభుత్వ విధానానికి మహిళా సంఘం మద్దతు తెలుపుతున్నాం. మన ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రజలు అభ్యంతరం జరిపే చోట ఏర్పాటు చెయ్యకుడదన్నా అధికారులు మంజూరు చేయడం దారుణం

మద్యం దుకాణం ఆ స్థలంలో ఏర్పాటు చేస్తే ఆందోళనకు దిగాల్సి వస్తుందని ఐద్వా కార్యదర్శి N రాజేశ్వరి, అధ్యక్షురాలుK ఈశ్వరిలు తెలిపారు.

About The Author