బుధవారం పెళ్లి … అంతలోనే పెళ్ళికూతురికి డెంగీ జ్వరం ..


బుధవారం పెళ్లి … అంతలోనే పెళ్ళికూతురికి డెంగీ జ్వరం .. శుక్రవారానికి పెళ్లికూతురు చనిపోయి శవమైంది .. ఈ దారుణ విషాదం చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం పంచాయతీ టీవీయన్‌ఆర్‌పురంలో జరిగింది. మూడుముళ్ల బంధంతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సంసార జీవితాన్ని గడిపేందుకు సిద్ధమవాల్సిన వేళ… పెళ్లికూతురిని డెంగీ జ్వరం కబళించింది. గ్రామానికి చెందిన కృష్ణంరాజు, రెడ్డెమ్మల కుమార్తె చంద్రకళ అలియాస్‌ కావ్య (18) గత నెల 30న (బుధవారం) పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఆమెకు డెంగీ సోకింది. ఆమెను తమిళనాడులోని షోళింగర్‌ ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి వేలూరులోని అడుకుంబారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు బంధుమిత్రులు, గ్రామస్థులు మొన్న బుధవారం పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఎలాగైనా ఆసుపత్రి నుంచి వధువును తీసుకొచ్చి తాళి కట్టించాలని పెద్దలు ప్రయత్నించారు. పరిస్థితి బాగా లేనందున వైద్యులు నిరాకరించడంతో పెళ్లి ఆగింది. శుక్రవారం ఆమె మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

About The Author