శ్రీకార్తీక పురాణము 18వ అధ్యాయం…


సత్కర్మానుష్ఠన ఫల ప్రభావము

” ఓ మునిచంద్రా! మీ దర్శనము అలన ధన్యుడనతిని. సంశయములు తీరునట్లు జ్ణానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి , గురువు, అన్న, దైవము సమస్తము మీరే, నా పుణ్యఫలితము వలననే కదా మీలాంటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై వుండగా, తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భగ్యము లేని యెడల ఈ కీకార్యణములో తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసిందే కదా! అట్టి నేనెక్కడ! మీ దర్శనభాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పుణ్యఫల పదాయియగు ఈ కార్తీకమాసమెక్కడ? పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించు టెక్కడ? ఇవి అన్నీ దైవికములగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కావున నన్ను తమ శుష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మావుడెట్లు అనుసరించాలో, దాని ఫలమెట్టిదో విశదీకరింపుము” అని ప్రార్థించెను.
” ఓ ధనలోభా! నీవడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్థమైనట్టివి కావున వివరించెదను శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ణానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకేగాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ణానము కలుగుటచే సత్కర్మలు చేయవలెనని. సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వానిఫలమును పరమేశ్వరార్పిత మొనరించిన జ్ణానము కలుగును. మానవుడు ఏజాతివాడో, ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటి వానిని ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మలను ఆచరించిననూ వ్యర్థమగును. అటులనే కార్తీకమాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాకమాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా అనగా సూర్యచంద్ర గ్రహణ సమయమునందయిననూ తప్పక నదిలో ప్రాతఃకాలస్నానము చేయవలెను. అలా స్నానము ఆచరించి దేవతార్చన చేసిన యెడల తప్పక వైకుంఠప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినములందును స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలస్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడగును. కార్తీకమాసంలో అరుణోదయ స్నానమాచరించినవారికి చతుర్విద పురుషార్థములు సిద్దించును. కార్తీకమాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శృస్త్రము, గంగా గోదావరీ నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమనమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దైవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీకమాసమందు విద్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించనివారు కోటియాగములు చేసిన ఫలము పొంది వైకుంఠనికి పోవుదురు”. అని ఆంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇలా ప్రశ్నించెను.
“ఓ మునిశ్రేష్ఠా! చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే! ఏ కారణము చేత దానిని ఆచరింపవలెను? ఇదివరకు ఎవ్వరైన ఈ వ్రతమును ఆచరించివున్నరా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తరముగా విశదీకరించండి” అని కోరెను.
ఆంగీరసుడు ” ఓయీ! వినుము. చాతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ద ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ద ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢశుద్ద ఏకాదశి ‘శయన ఏకాదశి’ అనియు. కార్తీకశుద్ధ ఏకాదశి ‘ఉత్థన ఏకాదశి’ అనీ, ఈ వ్రతమునకు చాతుర్మాస్యవ్రతమని పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతికొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలుసుకొంటిని కావున ఆ సంగతులు నీకు తెలియజేయుచ్చున్నాను.”
తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడగంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండియుండగా ఆ సమయమున నారదమహార్షి వచ్చి పద్మనేత్రుండును, చతుర్బాహుండును, కోటిసూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీహరి నారదునిగాంచి ఏమి తెలియనివానివలె మందహాసంతీ ఇట్లనెను. ‘ నారదా! నీవు క్షేమమే గదా! తిలోకసంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరు వారికి విధించబడిన ధర్మములను ఆచరిస్తున్నారా? ప్రపంచమున ఏ అరిష్ఠములు లేక యున్నవి కదా?” అని కుశలప్రశ్నలడిగెను. దానికి నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి ” ఓ దేవా! ఈ జగంబున నీవెరుగని విషయములు ఏవీ లేవు , అయిన నన్ను వచింపమనుటచే విన్నవించుచుంటిని, ప్రపంచమున కొందరు మనుష్యులు – మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగలేకున్నాను. కొందరు భుజింపకూడదనిన పదర్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాకమునుపే మధ్యలో మానివేయుచ్చున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందపారాయణులుగా జీవించుచ్చున్నారు. అట్టివారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపుడి” అని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మిదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణరూపముతో ఒంటరిగా తిరుగుచుండెను.
ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్దలను పరీక్షించుచుండెను. ఫుణ్యక్షేత్రములు, పుణ్యనదులు,పుణ్యశ్రమాలు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని యెగతాళి చేయుచుండిరి. కొందరు ” ఈ ముసలివానితో మనకేమి పని” అని వురుకుండిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తియైనను చూడకుండిరి. వీరి నందరిని భకవత్సలుడగు శ్రీహరి గాంచి “వీరి నెట్లు తరింపజేతునా?” అని ఆలోచించుచు, ముసలి బ్రాహ్మణ రూపమును విడచి, శంఖ, చక్ర, గదా, పద్మ, ,కౌస్తుభ, వనమాలాద్యలంకారుడై నిజరూపమును ధరించి, లక్ష్మీదేవితేడను, భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.
ఆ వనమందు తప్పస్సు చేసుకొనుచ్చున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమమూల కరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తిశ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు ఆ లక్ష్మీనారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

||శ్లోకము||

శాంతకారం! భుజగశయనం! పద్మనాభం! సురేశాం!
విశ్వాకారం! గగన సదృశం! మేఘవర్ణ శూభాంగం!
లక్ష్మీకాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!
వందేవిష్ణుం! భవభయహరం! సర్వలోకైకనాథం.!!

||శ్లోకము||

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగాథామేశ్వరీం
దాసీభూత సమప్త దేవ వనితాం లోకాకదీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్షలబ్ద విభవద్ర్బహ్మేంద్ర గంగాధరం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్.!!

18వ అధ్యాయము సమాప్తము
కార్తీకమాస 18వ రోజు ఆచరించవలసిన దానధర్మలు – జపతపాది విధులు – ఫలితములు

పూజించాల్సిన దైవము → గౌరి
జపించాల్సిన మంత్రము → ఓం గగగగ గౌర్యై స్వాహా
నిషిద్ధములు → ఉసిరి
దానములు → పులిహోర, అట్లు, బెల్లం
ఫలితము → అఖండ సౌభాగ్య ప్రాప్తి

About The Author