సినీ నిర్మాత, వ్యాపారవేత్త…. దగ్గుబాటి సురేష్ బాబు కంపెనీల్లో ఐటీ రైడ్స్…


సినీ నిర్మాత, వ్యాపారవేత్త…. దగ్గుబాటి సురేష్ బాబు కు సంబంధించిన కంపెనీల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. రామానాయుడు స్టూడియో, సురేష్ నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు అధికారులు. సురేష్ ప్రొడక్షన్స్ కు సంబంధించిన అన్ని కంపెనీల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. ఏటా జరిగే తనిఖీల్లో భాగంగానే సోదాలు చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
సురేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర నిరాతల్లో ఒకరు. ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతోన్న వెంకీమామ సినిమాకు సురేశ్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ లో సురేశ్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియో బాగా పాపులర్ అయింది.

About The Author