లారీని ఢీకొన్న బైక్….


అతివేగంతో బైక్ నడిపి మూలమలుపును సరిగా అంచనా వేయలేకపోయిన ద్విచక్రవాహనం లారీని ఢీకొట్టిన సంఘటన గురువారం జుక్కల్‌ మండల కేమ్‌రాజ్‌కల్లాలి గేటు వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, 108 సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖండేబల్లూర్‌ నుంచి వస్తున్న లారీ కేమ్‌రాజ్‌కల్లాలి గేటు వద్ద ఊళ్లోకి వెళ్లేందుకు మలుపు తిరుగుతోంది. ఇదే సమయంలో సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గి తండాకు చెందిన బర్దావల్‌ జైరో (35) ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి వేగంగా వస్తున్నారు. ఒకేసారి లారీ మలుపు తిరగడంతో ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న జైరో తలకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు.సమాచారాన్ని తెలుసుకున్న 108 వాహన సిబ్బంది హుటాహూటిన సంఘటన స్థలానికి చేరుకుని, ప్రాథమిక చికిత్స అందజేస్తూ బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఏఎస్సై సంజీవ్‌రావు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

About The Author