ఈవిడే నిర్భయ. ఈ పోస్ట్ చూసాక ఏడవని వారు ఉంటే చెప్పండి.


నిర్భయ కేసులో నిందితులను త్వరలో ఉరి. ఎప్పుడో చావాల్సిన వారు ఇప్పుడు చస్తున్నారు. ఎంత నిర్దాక్షిణ్యంగా ఆ చెల్లిని చంపినారో మీరు తెలుసుకోండి. ఇటువంటి వారిని మహిళా సంఘాలు వెనకేసుకొస్తే వారిని ఏమనాలి? ఉరి కరెక్టు కాదు అనే వారు ఇది చదవండి. ఆ చెల్లి మరణం ఎలా జరిగిందో…

23 ఏళ్ళ వైద్య విద్యార్థిని మరియు ఆమె స్నేహితుడు కలిసి ఆ రోజు సాయంత్రం ఢిల్లీ లోని సాకేత్ దగ్గర సినిమా చూసి ఇంటికి బయలుదేరారు. రాత్రి 9:30కు ఒక ప్రైవేటు బస్సు ఎక్కారు. అందులో ఐదుగురు ప్రయాణీకులతోపాటు ఒక డ్రైవర్ ఉన్నారు. వారంతా తాగి ఉన్నారని మరియు వారంతా ఒకటే గుంపునకు చెందినవారని వారికి తెలీదు. వారంతా నగరంలోని మురికివాడ చెందిన వారు. కొంతసేపటికి డ్రైవరు దారిమళ్ళించాడు. అలాగే బస్సు తలుపుకు కూడా గడియపెట్టారు. దీనితో అనుమానం వచ్చిన ఆమె స్నేహితుడు బస్సు సిబ్బందిని అడిగాడు.

అందుకు వారు రాత్రి పూట మీకేంపని ఒంటరిగా ఎంచేస్తున్నారని అడగటం మొదలుపెట్టారు. ఆ అమ్మాయితో దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన తన స్నేహితుడిను తలపైన ఇనుప రాడ్ తో కొట్టి అపస్మారక స్థితికి తీసుకెళ్ళారు.

ఆపై ఒంటరిగా ఆమెను బస్సు చివరకు ఈడ్చుకెళ్ళి అత్యాచారానికి ఒడికట్టారు. ఆమె అరచి, వారితో పెనుగులాడి నోటితో కొరికి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించింది. అందుకు వారు ఆమెను పలుమార్లు బలంగా ఇనుప రోడ్ తో కొట్టి ఆపై యోని లోకి ఇనుపరాడ్ ను పలుమార్లుచొచ్చి ఒక్కొక్కరు అత్యాచారం చేశారు.

ఈ ఉదంతమంతా బస్సు కడులుతున్డగానే జరిగింది. ఆమె గర్భసంచిలో ఆ ఇనుపరాడ్ ను పలుమార్లు చొచ్చి పైశాచిక ఆనందాన్ని పొందారు. బస్సును ఒకరితరువాత ఒకరు నడుపుతూనే తల నుంచి, ఉదరం నుంచి నెత్తురోడుతున్న ఆమెను అత్యాచారం చేశారు. సుమారు గంటకు పైగా హింసించిన ఆమెను వివస్త్రగానే రోడ్డు పైకి విసిరివేశారు.

వైద్య పరీక్షలలో డాక్టర్లు ఆమెకు ఇనుప రాడ్ చొచ్చటం మూలంగా ఉదరంలో, పేగులలో, మర్మాంగాలలో తీవ్రంగా దెబ్బలు తగిలాయని తెలిపారు. ఆ తరువాతి రోజు పోలీసు పరిశోధనలో ఆ ఇనుపరాడ్ తుప్పుపట్టి L ఆకారంలో ఉన్నదిగా తెలిపారు. ఉన్మాదులు వారిని రోడ్ పైకి విసిరివేశాక ఒకరు బస్సును కడిగారు.

రాత్రి 11 గంటలకు కొందరు గస్తీ సిబ్బందికి వివస్త్రంగా, అచేతనంగా పడి ఉన్న వారిగురించి తెలుపగా గస్తీ సిబ్బంది సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి వారు అత్యవసర చికిత్స చేసి ఆమెను వెంటిలేటర్ లో పెట్టారు. డాక్టర్లు పరీక్షించగా ఆమెలో ఉండవలసిన పేగులు కేవలం 5% మాత్రమే మిగిలి ఉన్నట్లుగా తెలుసుకున్నారు. ఉన్మాదులు ఆ రాడ్ ఆమె లోనికి చొచ్చి బలంగా బయటకు లాగటం మూలంగా ఆమె పేగులు బయటకు వచ్చినట్లు తెలిపారు.
19 డిసెంబర్ 2012 న దెబ్బతిన్న ఆమె పేగులను గాంగ్రెనె అనే వ్యాధి సోకే కారనమున్నందున తొలగించారు.

ఆ తరువాత ఆమెకు నరాల నుంచి పోషణ మరియు ఒషదాలను ఇచ్చారు. 21 డిసెంబర్ 2012 న ప్రభుత్వం ఆమెకు చక్కటి వైద్య సేవల కొరకు ఒక వైద్య కమిటీని నియమించింది. 25 డిసెంబర్ నాటికి ఆమె పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్లు ఆమె లోపలి రక్త స్రావం కొంతమేరకు త్రగిన్దని తెలిపారు.

26 డిసెంబర్ న ప్రధాని మన్మోహన్ సింగ్ చేపట్టిన కాబినెట్ మీటింగ్ లో ఆమెను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. మౌంట్ ఎలిజబెత్ అవయవ మార్పిడి ప్రత్యేకత కలిగిన ఆసుపత్రి.

28 డిసెంబర్ 2012 న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. డాక్టర్లు ఆమె ప్రాణాలతో పోరాడుతుందని తెలిపారు. ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో ఆమె 29 డిసెంబర్ 2012 న ఉదయం 4:45 కు మరణించింది. ఈ సంఘటనతో సంభందం ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు: రామ్ సింగ్ – బస్సు డ్రైవరు, అతని తమ్ముడు ముకేష్ సింగ్ లను రాజస్తాన్ లో అదుపులోకి తీసుకున్నారు. వినయ్ శర్మ – జిమ్ ఇన్స్ట్రక్టర్ ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే పవన్ గుప్త – ఒక పండ్ల వ్యాపారిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు, మైనర్ బాలుడైన రాజును ఉత్తార ప్రదేశ్ లో ఆనంద్ విహార్ టెర్మినల్ లో అదుపులోకి తీసుకున్నారు. అక్షయ్ ఠాకూర్ – బీహార్ నుంచి ఢిల్లీకి పనికి వచ్చిన ఇతనిని బీహార్ లో ఆరంగాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.

వీరందరూ ఆ రోజు తప్ప త్రాగి బస్సును విలాసంగా ఢిల్లీ చుట్టూ తిప్పుతున్నారు. రాజు ఆ రోజే వారందరినీ కలిశాడు. రామ్ సింగ్ ను 18 డిసెంబర్ 2012 మహానగర న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. ముకేష్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న తరువాత జైలు సహచరులు అతనిని కొడుతున్నందున తిహార్ జైలులో ప్రత్యేక గదిలో ఉంచారు. గుప్తాను అదుపులోకి తీసుకున్న తరువాత ఆటను తన నేరాన్నీ అంగీకరించి తనను ఉరితీయవలసినదిగ తెలిపాడు. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనకు వ్యతిరేకంగా ఇద్దరు ముంబై మహిళలు తమ వీపులపై “రేపిస్టులను ఉరితీయండి” అని వ్రాసుకొని నగ్నంగా ఫోజులిచ్చారు.

19 డిసెంబర్ న ఆమె స్నేహితుడు నిందితులను గుర్తించారు. 21 డిసెంబర్ 2012 న బాధితురాలు ఆమె వాంగ్మూలాన్ని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో సబ్ దివిసినల్ న్యాయాధికారికి పోలీస్ డిప్యూటీ కమిషనర్ గారి ముందు తెలిపారు.

ఈ కేసులో 2013 సెప్టెంబరు 13, శుక్రవారం తీర్పు వెలువడింది. నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయేవరకూ ఉరితీయటమే సరైన శిక్ష అని న్యాయస్థానం తీర్పుచెప్పింది. దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్‌ఠాకూర్ (28), పవన్‌గుప్తా (19), వినయ్‌శర్మ (20) లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది.

ఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా, ఒళ్లు గగుర్పొడిచే రీతిలో వీరు నేరానికి పాల్పడటం.. ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా నిలుపుతోందని కోర్టు అభివర్ణించింది.

ఒక నిస్సహాయ మహిళపై దోషుల అమానవీయ, భయానక చర్యలు జాతి అంతరాత్మను నిర్ఘాంతపరచాయని.. మహిళలపై నేరాలను సహించబోమనే సందేశం పంపటానికి వీరికి తీవ్రమైన శిక్ష అవసరమని అదనపు సెషన్స్ జడ్జి యోగేష్‌ఖన్నా తన 20 పేజీల తీర్పులో స్పష్టంచేశారు. ‘దోషులు చనిపోయే వరకూ ఉరితీయాలి’ అంటూ కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి శిక్షను ప్రకటించారు. నిస్సహాయురాలైన బాధితురాలిని చనిపోవటానికి గురిచేసిన చిత్రహింసలు, గాయాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది.

About The Author