క్షిపణి దాడులతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఇపుడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల సర్జరీ చేయించుకున్న తరవాత ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ ఓ వార్త కథనం ప్రచురించింది. ఈనెల 15వ తేదీన తన తాత జన్మదిన వేడులకు కిమ్‌ హాజరు కాలేదని, అంతకుమునుపు నాలుగు రోజుల క్రితం ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్‌…. ఆ తరవాత కన్పించలేదని సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఈ వార్త ధృవీకరణకు అమెరికా నిఘా వర్గాలను ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, ఉత్తర కొరియా నుంచి సమాచారం పొందడం కష్టమని ఆ మీడియా సంస్థ పేర్కొంది.

About The Author