30లోపు ఆంధ్రకు మెడికో విద్యార్థుల మృతదేహాలు…


ఫిలిప్పీన్స్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన
ఆంధ్రకు చెందిన మెడికో విద్యార్థుల మృతదేహాలను ఈ నెల 30లోపు ఆంధ్రకు చేరనున్నట్లు
నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు మెడికో విద్యార్థులు దాదాపు 25 రోజుల క్రిందట రోడ్డు ప్రమాదంలో మరిణించిన విషయం విదితమే.

వీరిని భారతదేశానికి తీసుకురావడం మేము గత 25 రోజులనుంచి ప్రయత్నం చేయడం జరుగుతున్నది .

దీనికి సంబంధించి నేడు మలేషియాలోని షిభు నగరం నుంచి మృతదేహాలను మనీలా విమానాశ్రయంకు తీసుకురావడం జరిగింది

మనీ లా నుండి ధోహకు అక్కడ నుండి భారత్ కు రేపు అర్దరాత్రికి లేదా 30 ఉదయానికి చేరుకోవడం
జరుగుతుందని ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు

దీనికి సంబంధించి భారత ప్రభుత్వానికి ,మలేషియా ప్రభుత్వానికి ప్రత్యేక చొరవ చూపిన అమిత్ షా, కిషన్ రెడ్డి, ఆంధ్ర సి,యం జగన్ కు అయన ధన్యవాదాలు తెలిపారు

About The Author