ఎపిఎంఎఫ్ తూర్పుగోదావరి కన్వీనర్ గా అప్పాజీ …


కాకినాడ, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ అడ్ హాక్ కమిటీ కన్వీనర్ గా సీనియర్ జర్నలిస్టు చొల్లంగి అప్పాజీ నియమితులయ్యారు. ఈ మేరకు ఎపిఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా ఎపిఎంఎఫ్ సభ్యత్వ నమోదు నిర్వహించి ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటుకు కృషి చేయాలని అప్పాజీని ఆదేశించారు. ఈ సందర్భంగా అప్పాజీ కాకినాడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో ఎపిఎంఎఫ్ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కోసం ఎపిఎంఎఫ్ పోరాడుతోందని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఎపిఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డికి అప్పాజీ కృతజ్ఞతలు తెలిపారు.

About The Author