నిండు గర్భంలో శిశువు మాయం రాత్రి తొమ్మిది నెలల నిండు గర్భిణీ ఉదయం లేచే సరికి కడుపు ఖాలి.


నిండు గర్భంలో శిశువు మాయం రాత్రి తొమ్మిది నెలల నిండు గర్భిణీ ఉదయం లేచే సరికి కడుపు ఖాలి. జోగులంబ గద్వాల జిల్లాలో వింత కలకలం. దేవుడు ఆవహించి గర్భంలో ఉన్న శిశువును మాయం. నిజమా అంటు నివ్వెరపోతూన్న జిల్లా వాసులు.. దేశం మొత్తం కరోనాతో చస్తుంటే జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం వింత సంఘటనతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు వివరాల్లోకి జిల్లాలోని మనోపాడు మండలం పెద్ద పోతులపాడు గ్రామానికి చెందిన మంజుల(25) ఆరు సంవత్సరాల క్రితం చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ తో వివాహం అయ్యింది.. అప్పటి నుండి ఆమె గర్భం దాల్చలేదు.గత ఏడాది గర్భం నిలబడడంతో ప్రతి నెల ఆశా వర్కర్ల సహాయముతో మానోపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు చేయించుకుంటు వచ్చింది మంజుల. అయితే శనివారం రాత్రి ప్రసవ నొప్పులు అధికం కావడంతో హుటాహుటిన గ్రామం నుండి మానోపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులతో వచ్చింది. వచ్చిన వెంటనే ఆమెకు పూనకం రావడం, వైద్య సేవలను నిరాకరించింది. నాకు ఒక దేవుడు ఆవహించడాని నన్ను ఆసుపత్రిలోకి వద్దని గట్టిగా కేకలు పెట్టింది.. ఇది చూసిన డాక్టర్లు దిక్కుతోచని స్థితిలో వైద్యం అందించాలో వద్దోనని నివ్వెరపోయారు.. వైద్యనికి సహకరించని మంజులను చేసేది లేక ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ వస్తామని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు ఆటోలో తీసుకెళ్లారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది.. ఆమె ఇంటికి వెళ్లిన తరువాత ఎప్పటి మాదిరిగానే నిద్రపోయింది. ఉదయం లేచి చూసే సరికి ఆమె కడుపు ఖాలిగా ఉండటంతో ఇదికాస్త ఊరి జనాలకు తెలియడంతో రాత్రికి రాత్రి కడుపులో పాప ఎక్కడ పోయిందని జనాలు బిక్క మొఖం వేశారు.. అసలు ఏమి జరిగింది. ఇరుగు పొరుగు వారితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కలసి అడగగా ఆమె మాత్రం తెల్లవారు జామున మౌలాలి స్వామి నా బిడ్డను తీసుకెళ్లాడని చెప్పుకొచ్చింది.అసలు ఆమె నిండు గర్భం ఎక్కడికి పోయింది. ఆమె కడుపులో ఉన్న శిశువు మాయం అయ్యాడా. అర్థం కాకపోవడంతో హుటాహుటిన ఆమెను తీసుకోని కుటుంబ సభ్యులు మళ్ళీ మానోపాడు ఆసుపత్రికి ఆదివారంనాడు చేరుకున్నారు. మంజులకు గర్భం దాల్చిన మాట వాస్తవమే:ఆశ వర్కరు మంజుల గర్భం దాల్చిన మాట వాస్తవమేనని ఆమె గర్భం దాల్చినప్పటి నుండి ఆమెను చికిత్సలు నిమిత్తం ప్రతినేల ఆసుపత్రిలో తీసుకొచ్చే ఆశ వర్కరు తెలిపారు.. నిన్నటి వరకు ఆమె గర్భంలో శిశువు ఉన్నమాట వాస్తవమేనని కాని ఈరోజు ఏమైందో తెలియదని అసలు నిన్న ఆమె మనోపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళిందో లేదో మాకు తెలియదని వారు చెప్పారు మంజులకు గర్భం ఉన్న మాట వాస్తవమే.. కానీ ఇప్పుడు లేదు :డాక్టర్ దివ్య ఈ సంఘటన తెలుసుకున్న మండల వైద్యధికారి దివ్య హుటాహుటిన మనోపాడు ఆసుపత్రికి చేరుకొని పరిశీలించారు. గత ఏడు నెలల క్రితం కడుపుతో ఉన్నప్పుడు పరీక్షలను నేనే చేశాను. ఇప్పుడు పరిశీలించాం.ఆమె డెలివరీ అయ్యినట్లు,అబార్షన్ అయ్యినట్లు ఎలాంటి ఆధారాలు కనబడటం లేదని ఆమెకు స్కానింగ్ చేస్తే తప్ప పూర్తి వివరాలు ఏమీ జరిగిందో తెలుస్తోందని దేవుడు ఆవహించాడు అనే విషయం అవాస్తవమని స్కానింగ్ రిపోర్టును బట్టి నిజాలు తెలుస్తాయని తెలిపారు. ఆమె వెంట వచ్చిన ఆశ వర్కర్లు మాత్రం నిండు కడుపుతో ఉంది. రాత్రి ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చామన మా కండ్లతో మేము చూశామన్నారు. ఆమె కడుపు ఎలా ఖాళీ అయ్యిందో మాకు అర్థం కావటం లేదన్నారు. తల్లి దండ్రులు, భర్త కూడా కూడా అదే విషయం చెబుతున్నారు. నిన్నటి వరకు నిండు గర్భిణీ , అబద్ధాలు చెప్పడం మాకు అవసరం లేదన్నారు. మంజుల దేవుడి లీలా అంటుంది… చూద్దాం ఇది ఎవరి లీలలో

About The Author