నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తొలిగింపు.. ఆర్డినెన్స్ చెల్లదు: జంధ్యాల


*ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తొలిగింపు వ్యవహారంపై తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.*

★ నిమ్మగడ్డ తొలగింపుపై పిటిషనర్ల తరుపున వాదనలు పూర్తయ్యాయి.

★ ఏపీ మాజీ ఎస్ఈసీ తొలగింపుపై వాదనలు వినిపించేందుకు ప్రభుత్వానికి ఒకటిన్నర రోజు సమయాన్ని ధర్మాసనం ఇచ్చింది.

★ శుక్రవారం సాయంత్రానికి విచారణ పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

★ కోర్టు ముందు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవి శంకర్ తన వాదనలు వినిపించారు.

★ 243K ప్రకారం సర్వీస్ నిబంధనలు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు వర్తిస్తాయని అన్నారు.

★ ఆర్డినెన్స్ తీసుకురావడానికి గల కారణాలు ఏవీ స్పష్టంగా చెప్పనపుడు… ఆర్డినెన్స్ చెల్లదని జంధ్యాల వాదించారు.

★ ఇది పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడడమే అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా చెప్పిందని జంధ్యాల అన్నారు.

★ ఎన్నికల సంస్కరణల పేరుతో 77 ఏళ్ల వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తే ఆయన ఎంత వరకు సమర్ధవంతంగా పనిచేయగలరని జంధ్యాల వాధించారు.

★ రమేష్ కుమార్ నియామకాన్ని రాజ్యాంగంలోని 243K అధికారణ మేరకు నియమించారని, ప్రభుత్వం మాత్రం 200 ప్రకారం నియమించామని చెబుతుందని, 200 ప్రకారం చేయడానికి వీలేదని, ఎలక్షన్ కమిషనర్ నియామకాన్ని 243K ప్రకారమే చేపట్టాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు.

★ ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని, ప్రభుత్వ ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశం ఉందని జంధ్యాల రవి శంకర్ వాదించారు.

About The Author