చైనాను దాటినా భారత్…


కరోనా కేసుల విషయంలో భారత్‌ చైనాను దాటింది. వైరస్‌కు కేంద్రబిందువైన చైనాలో ఇప్పటి వరకు 82,933 కేసులు నమోదుకాగా భారత్‌లో 85,538 కేసులు నమోదయ్యాయి. దీంతో ఎక్కువ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్‌ 11వ స్థానంలో నిలిచింది. అయితే మరణాల పరంగా చూస్తే చైనా కన్నా భారత్‌ కొంత మెరుగైన స్థానంలో ఉన్నది. వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటి వరకు 4,633 మంది మరణించగా.. మన దేశంలో 2,649 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 లక్షల మందికి వైరస్‌ సోకగా.. ఇప్పటి వరకు 3 లక్షల మందికిపైగా మరణించారు. అమెరికాలో అత్యధికంగా 14,63,301 కేసులు నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో రష్యా, బ్రిటన్‌, స్పెయిన్‌, ఇటలీ, బ్రెజిల్‌ నిలిచాయి. ఈ దేశాల్లో దాదాపు 2 లక్షల చొప్పున కేసులు వెలుగుచూశాయి. అలాగే ఫ్రాన్స్‌, జర్మనీ, టర్కీ, ఇరాన్‌లలో ఒక్కోదేశంలో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో (గురువారం నుంచి శుక్రవారం నాటికి) భారత్‌లో 3,967 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారిన పడిన వారిలో ఇప్పటి వరకు 27,919 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 34.06గా నమోదైంది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,970 కొత్త పాజిటివ్‌ కేసులతో పాటు, వైరస్‌ సోకి 103 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85,940కి చేరింది. ఇక ఇప్పటివరకు 30,153 మంది డిశ్చార్జ్ కాగా, 2,752 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 53,035 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విషయంలో భారత్‌ చైనాను దాటింది. చైనాలో ఇప్పటి వరకు 82,933 కేసులు నమోదు కాగా భారత్‌లో 85,940 కేసులు నమోదయ్యాయి.

దీంతో ఎక్కువ కేసులు నమోదైన దేశాల జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ 11వ స్థానంలో నిలిచింది. అయితే మరణాల పరంగా చూస్తే చైనా కన్నా భారత్‌ కొంత తక్కువ మరణాలు సంభవించడం ఊరటకలిగిస్తోంది. వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటి వరకు 4,633 మంది మరణించగా.. మన దేశంలో 2,649 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46.19 లక్షలు దాటింది. వైరస్‌ సోకి 3.08 లక్షల మంది మృతి చెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 17.54 లక్షల మంది కోలుకున్నారు.

About The Author