బీహార్ బాలికపై ఇవాంకా ప్రశంసలు.. భారతీయుల ఓర్పు, ప్రేమకు నిదర్శనమని కితాబు…


★ లాక్‌డౌన్ వేళ తండ్రిని ఢిల్లీ నుంచి బీహార్‌లోని తన స్వస్థలం దర్భాంగాకు 1200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి, పెద్ద సాహసం చేసిన జోతికుమారిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

★ బీహార్‌కు చెందిన బాలిక జ్యోతి కుమారి (15) చేసిన సాహసానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ బాలిక అసాధారణ తెగువకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

★ లాక్‌డౌన్ వేళ ఉపాధి కోల్పోయి, ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని ఢిల్లీ నుంచి బీహార్‌లోని దర్భాంగాకు పది, యాబై కాదు, ఏకంగా 1,200 కిలోమీటర్లు సైకిల్‌పై ఎక్కించుకుని దర్భంగాకు క్షేమంగా చేరుకుంది. దీనిపై తాజాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.

★ ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో జ్యోతి కుమారి ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు.

★ _*‘15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1,200 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి ఏడు రోజుల్లో చేరుకుంది.. ఇది ఓ అద్భుతం.. భారతీయుల్లోని ఆత్మగౌరవం, ఓర్పు, ప్రేమకు ఇది అద్దం పడుతోంది.. సైక్లింగ్ సమాఖ్యను ఆకర్షించింది’*_ అంటూ *ఇవాంకా ట్రంప్* ట్విట్టర్‌లో తండ్రి పట్ల జ్యోతికున్న ప్రేమను కొనియాడారు

★ కాగా, జ్యోతికుమారిని అకాడ‌మీలోకి చేర్చుకోవాల‌ని భారత సైక్లింగ్ సమాఖ్య భావించింది.

★ లాక్‌డౌన్ ఎత్తివేశాక ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. బీహార్ నుంచి ఆమెను ఢిల్లీకి తీసుకువ‌చ్చి, వ‌స‌తి క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఖ‌ర్చుల‌ను పూర్తిగా తామే భ‌రిస్తామని, ఆ బాలిక‌లో అసాధార‌ణ‌మైన నైపుణ్యాలున్నాయ‌ని, 1200 కిమీ వ‌ర‌కు సైకిల్ తొక్కడం సాధారణ విషయం కాద‌ని స‌మాఖ్య పెద్ద‌లు వ్యాఖ్యానించారు.

★ జ్యోతి కుమారి చేసిన సాహసానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1,200 కిలోమీటర్ల వారం రోజుల్లోనే చేరుకోవడంపై ముక్కున వేలేసుకుంటున్నారు.

★ ఆడపిల్ల ఇల్లు దాటి వీధిలోకి వెళ్తే భద్రంగా వస్తుందో? లేదోన్న పరిస్థితులున్న ఈ రోజుల్లో ధైర్యంగా రాత్రివేళ కూడా సైకిల్ తొక్కుతూ క్షేమంగా ఇంటికి చేరింది.

★ లాక్‌డౌన్ వేళ ఉపాధి కోల్పోవడంతో సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని, ఓ ట్రక్కు డ్రైవర్‌ను జ్యోతి తండ్రి సంప్రదించారు. అతడు రూ.6 వేలు డిమాండ్ చేయడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

★ తండ్రి బాధను అర్ధం చేసుకున్న జ్యోతి రూ.500లతో ఓ సైకిల్‌ను కొని వెళ్లిపోదామని సలహా ఇచ్చింది.

★ కుమార్తె సలహాతో ఓ సైకిల్‌ను కొనుగోలుచేసి మే 10న ఢిల్లీ నుంచి దర్భాంగకు బయల్దేరారు.

About The Author