క‌ల‌కలం: క‌రోనా సాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి….


 మీర‌ట్ గ్రామ‌వాసులు కోవిడ్ భ‌యంతో వ‌ణికిపోతున్నారు. దీనికి కార‌ణం అక్క‌డి కోతుల గుంపు చేసిన తుంట‌రి ప‌నే. ఆట బొమ్మ అనుకుందో, అర‌టి పండే అనుకుందో ఏమో కానీ ఓ కోతుల గుంపు క‌రోనా అనుమానితుల న‌మూనాల‌ను ఎత్తుకె ళ్లింది. ఈ వింత‌ ఘ‌ట‌న మ‌ధ్యప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. మీర‌ట్‌లో ముగ్గురు కోవిడ్ అనుమానితుల‌కు వైద్యులు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వీటిని ప‌రీక్షించేందుకు శుక్ర‌వారం ఓ ల్యాబ్ టెక్నీషియ‌న్ ఈ టెస్ట్ సాంపిల్స్‌ను మోసుకు వెళుతూ ఉండ‌గా ఒక్కసారిగా కోతులు మూకుమ్మడిగా అత‌నిపై దాడి చేశాయి.
అత‌ని ద‌గ్గ‌ర ఉన్న సాంపిల్స్‌ను ఎత్తుకెళ్లాయి. అందులో ఓ కోతి క‌రోనా టెస్టింగ్ కిట్‌ను న‌మిలివేస్తూ క‌నిపించింద‌ని గ్రామ‌స్థులు పేర్కొన్నారు.  దీంతో ఆ ప్రాంత‌వాసులు హ‌డ‌లెత్తిపోతున్నారు. టెస్టింగ్ కిట్ల‌లో క‌రోనా వైర‌స్‌ ఉండొచ్చేమోన‌ని, వాటిని వాన‌రాలు ఎక్క‌డ‌ త‌మ ఇళ్ల‌పై విసిరేస్తాయోన‌ని ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు లోన‌వుతున్నారు. మ‌రోవైపు వైద్యులు కోవిడ్ అనుమానితుల ద‌గ్గ‌ర నుంచి మ‌రోసారి నమూనాల‌ను సేక‌రించారు

About The Author