*భారత్‌లో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది..*

★ గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7964 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 265 మంది మరణించారు..

*ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,73,763కి చేరింది..*

★ ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

*దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 82,369 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,971 మంది మృతిచెందారు..*

★ ప్రస్తుతం దేశంలో 86,422 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

*ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 60లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 3,66,891 మంది మరణించారు..*

★ తాజాగా ఒక్క అమెరికాలోనే 1,225 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 1,04,542కు చేరింది…

★ ఇప్పటివరకు అగ్రరాజ్యంలో 17,45,606 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

★ ఇక పాకిస్తాన్‌లోనూ కరోనా కేసులు గణనీయంగానే పెరుగుతున్నాయి. శుక్రవారం 2429 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

★ దీంతో పాక్‌లో కరోనా కేసుల సంఖ్య 66,457కు చేరింది.

*చైనాలో శుక్రవారం కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది…*

About The Author