ఆంధ్రప్రదేశ్ , తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు…


ఆంధ్రప్రదేశ్ , తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు…

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

పిడుగులు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

About The Author