అర్హత ఉన్న పాత్రికేయులు అందరికీ ఇంటి స్థలాలు

కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా

చిత్తూరు:జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక పాత్రికేయుడికి జూలై 8 వ తేదీ  నాటికి ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా హామీ ఇచ్చారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో  కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ని కలిసి పాత్రికేయుల సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా  సైతం పాల్గొన్నారు , వచ్చే నెల పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయనుండగా అదే రోజున పాత్రికేయులకు సైతం స్థలాలను మంజూరు చేస్తామన్నారు. అర్హుల జాబితాను ఆయా ఆర్డీవోలు ఆన్లైన్లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు ఈ మొత్తం బాధ్యతను పర్యవేక్షించాలని DPRO పద్మజ ను ఆదేశించారు  కలెక్టర్ ను కలిసిన వారిలో చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి లోకనాథం అశోక్ కుమార్ ఉపాధ్యక్షులు మహేష్ సభ్యులు శివప్రసాద్, రాజేష్ తదితరులు ఉన్నారు.

About The Author