మైనర్ బాలికపై లైంగిక వెధింపులు కేసులోని: ముగ్గురు అరెస్ట్

చిత్తూరుజిల్లా :బి కొత్తకోట మండలం బండారు వారి పల్లి కు చెందిన మైనర్ బాలిక ను కిడ్నప్ చేసి ఆపై ముగ్గురు దుండగులు అఘాయత్నానికి పాల్పడ్డారు. రూలర్ సీఐ అశోక్ కుమార్ కథనం మేరకు..వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి లోని బండారువారి పల్లె గ్రామపంచాయతీ పెద్దపల్లి కి చెందిన 13 సంవత్సరాల వయస్సు కలిగిన 8 వ తరగతి విద్యార్థిని ను ముగ్గురు దుండగులు జూన్ ఒకటో తేదీ సోమవారం సాయంత్రం కిడ్నప్ చేసి తీసుకెళ్లారు. అయితే ఆ విద్యార్థిని దుండగులు శీలం వారిపల్లె పంచాయతీ పరిధిలోని ఓ స్టోన్ క్వారీ సమీపంలో బంధించారు.భయంతో మైనర్ బాలిక కేకలు వేయగా అరుపులు గుర్తించిన సమీప పొలాల కు చెందిన కొందరు రైతులు సమాచారాన్ని విద్యార్థిని కుటుంబ సభ్యులకు అందించడంలో కుటుంబ సభ్యులు రాత్రి 10 గంటల సమయం లో క్వారీ వద్దకు చేరుకొని దుండగులనుంచిబాలికనురక్షించుకున్నారు. కాగ ఈ అఘాయిత్యాని కి పాల్పడ్డ పాల్పడిన నిందితులపై జూన్ రెండవ తేదీ కేసు నమోదు చేసిన పోలీసులు

నిందితుల్లో ఒకరు అంగళ్ళు సమీపం లో జరిగిన జంట హత్యకేసు లోను అలాగే మదనపల్లె పట్టణం లో ఓ ప్రముఖ మహిళ న్యాయవాది హత్య కేసులో నిందితుడు వెంకటేష్ గా  గుర్తించిన రూరల్ సిఐ అశోక్ కుమార్ వారిపై POSCO Act పై కేసును నమోదు, చేసి క్రైమ్ నెం.191/2020,U/sec 366(A),354(A),509,506,323 r/w 34 IPC and sec 7 r/w 8 & 17 of POSCO Act కేసు నమోదు చేశారు పరారీలో ఉన్న A1.చల్లా. వెంకటేష్ (@ మహేష్), A2.బత్తల. వెంకటచలపతి, A3.ఆలీకుంట.రాజశేఖర్ నిందితులను బి.కొత్తకోట మండలం, కాండ్లమడుగు క్రాస్ వద్ద మదనపల్లె రూరల్ సిఐ బి.అశోక్ కుమార్ బి.కొత్తకోట ఎస్ఐ సునీల్ కుమార్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు ఈ దాడిలో పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ గుండాలనాయక్, హెడ్ కానిస్టేబుల్ రెడ్డప్పనాయక్, కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ యాదవ్,STF కానిస్టేబుల్ రాఘవ పాల్గొన్నారు

About The Author