మల్లన్న సేవలో రామ్ చరణ్ సతీమణి కొణిదల ఉపాసన…


దర్శన అనంతరం గిరిజనులకు నిత్య అవసరాల సరుకులు పంపిణీ

శ్రీశైలo

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం లో కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ను సినీ ప్రముఖ నటుడు రాంచరణ్ సతీమణి అప్పోల్లో చైర్ పర్సన్ కొణిదల ఉపాసన మంగళ వారం దర్శించుకున్నారు.

లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల ఉన్నందున అలంకార దర్శనం చేసుకున్నారు.

దర్శనార్థం వచ్చిన వీరికి ఈఓ రామారావు, ఆలయ అధికారులు, ఎస్సై హరిప్రసాద్, పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు. దర్శన అనంతరం లింగాల గట్టు అటవీ బేస్ క్యాంప్ వద్ద తాత్కాలిక ఉద్యోగులకు, గిరిజనులకు 200 కుటుంబాలకు నిత్య అవసరాల సరుకులను పంపిణీ చేశారు.

About The Author