కత్తులతో యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం

కొండమల్లేపల్లి: నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షల నేపంతో ఓ యువకుడిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసిన ఘటన జిల్లాలోని కొండమల్లేపల్లిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొలుముంతాల పహాడ్ గ్రామ పంచాయతీలోని బాపూజీనగర్‌కు చెందిన రాపాని యాదగిరి, అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకుల మధ్య గత కొంత కాలంగా గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న యాదగిరిపై కొండమల్లేపల్లి సమీపంలోని సాగర్‌ రోడ్డు వద్దనున్న పెట్రోల్‌ బంక్‌వద్ద కత్తులతో దాడికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకోవడంతో దుండగలు అక్కడినుంచి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యాదగిరిని చికిత్స నిమిత్తం పోలీసులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యాదగిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకొండ పోలీసులు తెలిపారు.

About The Author