మారటోరియంపై సమాధానమివ్వండి: సుప్రీం

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా విధించిన మారటోరియం అంశంపై సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఆర్‌బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశంపై మూడు రోజుల్లోగా ఇరు పక్షాలు సమావేశమై నిర్ణయం తీసుకోవాని సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

రుణాలపై ఆరు నెలల పాటు ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. మారటోరియం కాలంలో చెల్లింపులపై వడ్డీ వసూలు చేయడంపై ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, తామేమీ మారటోరియం కాలం మొత్తానికి వడ్డీ వసూలును మాఫీ చేయాలని అనడం ఏదని, కేవలం వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశం మాత్రమే అడుగుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. విస్తృత ప్రయోజనాలను, సమన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని దీని గురించి ప్రశ్నిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. వడ్డీపై వడ్డీని మాఫీ చేయవచ్చా అనే అంశం వరకు మాత్రమే పరిమితమవ్వాలని సూచించింది. దీనిపై కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. ఆర్‌బీఐతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే దీనిపై మూడు రోజుల్లోగా సమావేశమై, అనంతరం అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది.

About The Author