యాదాద్రీశుడి సేవలో ప్రధాని మోదీ సోదరుడు…

యాదాద్రీశుడి సేవలో ప్రధాని మోదీ సోదరుడు

రాష్ట్రంలో పేరొందిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు సోమాభాయి మోదీ బుధవారం సందర్శించారు. బాలాలయంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. యాదాద్రీశుడి దర్శనంతో మానసిక ప్రశాంతత చేకూరిందని సోమాభాయి మోదీ తెలిపారు. దైవదర్శన అనంతరం పూజారులు ఆలయ ఆచారంగా శ్రీ స్వామి అమ్మవార్ల ఆశీస్సులను, ఆలయ అధికారులు దేవుడి ప్రసాదాన్ని అందజేశారు.

About The Author