ఒకే తాడుకు ఉరి వేసుకున్న ప్రియుడు, నవవధువు…


ప్రేమించినవాడిని పెళ్లి చేసుకుందామనుకునేలగా పెద్దలు మరో వ్యక్తితో పెళ్లి ఖాయం చేశారు. పెళ్లికూడా చేసేశారు. కానీ ప్రాణంగా ప్రేమించినవాడిని మరచిపోలేకా..మూడు ముడులు వేసిన వ్యక్తితో కలిసి జీవించలేక మానసిక సంఘర్షణలో కొట్టుమిట్టాడిని ఓ నవ వధువు ప్రేమించినవాడితో కలిసి చావులో ఒకటైంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో విషాదం నింపింది. నెలరోజుల కిందట వివాహమైన యువతి ప్రియుడితో కలసి ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన కటికె మీనా అనే 19 ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన సార కార్తీక్ అనే 20 ఏళ్ల అబ్బాయి ప్రేమించుకున్నారు. సదామామూలుగానే ప్రేమించిన వాడిని కాదని మీనాకు వేరొకరితో పెళ్లి నిశ్చయించారు. మే నెలలో శంషాబాద్ మండలం మంచిరేవులకి చెందిన అబ్బాయితో మీనాకు పెళ్లి చేసేశారు. అమ్మయ్యా..మా ఇంటి పరువు కాపాడుకున్నాం అనుకుని మీనా తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కూతురి మనస్సును అర్థం చేసుకోలేని ఆ తల్లిదండ్రులకు మీనా మరోరకంగా వేదన మిగిల్చింది. ప్రేమించిన వ్యక్తితో కలసి బతకలేక..కట్టుకున్న భర్తతో జీవితాన్ని పంచుకోలేక మీనా తాను ప్రేమించిన కార్తీక్ తో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నవాబుపేట మండలం పూలపల్లి గ్రామ పరిధిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమించిన వ్యక్తితో కలిసి బతకలేక.. విడిచి ఉండలేక ప్రేమ జంట ఇష్టం లేని పెళ్లి కారణంగానే ప్రేమ జంట ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పచ్చటి మైదానంలో…ఒకేతాడుతో చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాల్ని చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఇద్దరూ ఉరివేసుకొని చాలాసేపు అయినట్లు కనిపిస్తుండటంతో…వెంటనే పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించీ..మృతదేహాల్ని కిందకు దింపారు. అక్కడ‌ ఓ బైక్ పడి ఉంది. దాని నంబర్ బట్టీ పరిశీలించగా..వాళ్లు గతంలో ప్రేమించుకున్న ప్రేమికులు మీనా, కార్తీక్ లుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

About The Author