గంజాయి సరఫరా చేస్తున్న ఘరానా ముఠా అరెస్ట్.

వివరాలు వెల్లడించిన హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి  శ్రీనివాసరావు…

తెలంగాణ;గత కొంతకాలంగా సైదాపూర్ మండలం లోని గ్రామాలతో పాటు చుట్టూ ప్రక్కల మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా చేస్తూ,అధిక సంఖ్యలో విద్యార్థులను,యువతను గంజాయికి బానిసగా మారుస్తూ,వ్యాపారంగా చేసుకొని,అక్రమార్జన చేస్తున్న 6 మంది గల ముఠా సభ్యులను చాకచక్యంగా వలపన్ని అరెస్ట్ చేసి,గంజాయి గుట్టురట్టు చేసిన సైదాపూర్ పోలీసులు …

పట్టుబడిన విధానం & నేరం చేయు పద్దతి…

నిందితులు ఆరుగురు జల్సాలకు అలవాటు పడి,వారి వారి పనులను చేసుకోకుండా ఎలాగైనా అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో, అందరూ ఒక ముఠా గా ఏర్పడి,ములుగు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేసుకొని తీసుకువచ్చి,సైదాపూర్ మండలం లోని గుండ్లపల్లి గ్రామం కేంద్రంగా చేసుకుని,యువకులను,విద్యార్థులను లక్ష్యముగా చేసుకొని వారికి చిన్న చిన్న కవర్లలో గంజాయి నింపి, ప్యాకెట్లగా చేసి ఒక్కొక్క ప్యాకెట్ ని 800/- నుండి 1000/- ల వరకు అమ్ముతూ డబ్బులను సంపాదిస్తున్నారు…తద్వారా యువకులను,విద్యార్థులను గంజాయికి బానిసలుగా మారుస్తున్నారు….కొంత మంది యువకులు గంజాయికి అలవాటు పడి నేరస్తులుగా మారుతున్నారు….

ఈరోజు గుండ్లపల్లి గ్రామంలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తూ, అధిక మొత్తంలో గంజాయిని వారి వద్ద కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు సైదాపూర్ ఎస్సై ప్రశాంత్ రావు సిబ్బందితో యుక్తముగా రైడ్ చేయగా,రెడ్ హ్యాండెడ్ గా గంజాయి సేవిస్తూ, దాదాపు అందరి వద్ద కలిపి 5 కిలోల గంజాయి కలిగి ఉండగా,స్వాధీనం చేసుకోవడం జరిగింది….తర్వాత ఎమ్మార్వో సైదాపూర్ గారి సమక్షంలో సీజ్ చేసి,కేసు నమోదు చేసుకొని,నిందితులను అరెస్ట్ చేసి,కేసు దర్యాప్తు చేయడం జరుగుతున్నది….

నిందితుల యొక్క పూర్తి వివరాలు…

1.ఎండి.పర్వీజ్ ఖాన్ s/o యాసిన్ ఖాన్ ,42సం, ముస్లిం,r/o వెంకటాపుర్ (గ్రామం & మండలం),ములుగు జిల్లా….*

2.ములుగు హరిదీప్ s/o ఎల్లయ్య ,23సం, మాదిగ,r/o భూపాలపల్లి గ్రామం & మండలం & జిల్లా….

3.కేంసారపు రాకేష్ s/o కనకయ్య ,20సం, ఎరుకల,r/o గుండ్లపల్లి  గ్రామం,సైదాపూర్ మండలం,కరీంనగర్ జిల్లా….

4.లంకదాసరి భరత్ s/o సదయ్య ,20సం, మాదిగ,r/o అమ్మనగుర్తి గ్రామం, సైదాపూర్ మండలం,కరీంనగర్ జిల్లా….*

5.ఆకునూరి రాజు  s/o శ్రీనివాస్ ,20సం, మాదిగ,r/o చెల్పూర్ గ్రామం,సైదాపూర్ మండలం,కరీంనగర్ జిల్లా….

6.లంకదాసరి రాజుకుమార్ s/o ఎల్లయ్య ,22సం, మాదిగ,r/o అమ్మనగుర్తి గ్రామం,సైదాపూర్ మండలం,కరీంనగర్ జిల్లా…

పట్టుబడిన సొత్తు వివరాలు..

దాదాపు 5కిలోల గంజాయి…విలువ 1,18,000/-…రెండు బైకులు స్వాధీనం

About The Author