అక్రమ మద్యం రవాణాచేస్తున్నా ముగ్గురు వ్యక్తులు ఆటో, 1010మద్యం సీజ్

కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుఉత్తర్వులు మేరకు నందిగామ డిఎస్పీ రమణ మూర్తి, నందిగామ రూరల్ సిఐ కే సతీష్ ఆదేశానుసారం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ వద్ద  పెద్దాపురం,దొడ్డవరప్పాడు గ్రామాల్లో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గురువారం ముగ్గురు వ్యక్తులు 3 ఆటోలు లో వారి వద్ద నుండి 1010మద్యం సీసాలనుతెలంగాణ రాష్ట్రం ఎర్రు పాలెం గ్రామం నుంచి తీసుకొస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వారి పై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం అక్రమ రవాణా జరక్కుండా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు.అక్రమ మద్యాన్ని తరలించే వ్యక్తులపై అవసరమైతే రౌడీషీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు.అక్రమ మద్యం రవాణాచేస్తున్నా వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

About The Author