తితిదే CPS ఎంప్లాయిస్ అసోసియేషన్

తిరుపతి:కరోనా పాజిటివ్ వచ్చిన మన తితిదే ఉద్యోగుల ఆరోగ్యం త్వోరగా మెరుగుపడాలని, వారికి మనమందరం  తోడుగా ఉన్నామని తెలియచేయడానికి, వారిలో మనోధైర్యం నింపడానికి ఈ రోజు తితిదే CPS ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాసం/ మాధవం లో ఉన్న మన తితిదే ఉద్యోగులకు డ్రై ఫ్రూట్స్ ( బాదం, ఆమ్లా (విటమిన్ C), జీడిపప్పు, తెల్ల నువ్వుల లడ్డులు, లయన్ డేట్స్, ఎండు ద్రాక్ష) వంటి పౌష్టికాహారాలు కిట్ల రూపంలో ఇవ్వడం జరిగింది. దీనిని  మొత్తం అక్కడ విధులు నిర్వహిస్తున్న AEO(G) శ్రీ K.N.రామకృష్ణ గారికి మరియు సూపరింటెండెంట్ శ్రీ శివ కుమార్ గారికి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే సహాయ సహకారాలు అందచేసిన వారు తితిదే ఎంప్లాయిస్ బ్యాంకు డైరెక్టర్ మరియు తితిదే CPS ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్, ఉపాధ్యక్షులు పెంచులయ్య, రంగనాయక్, అడ్వైసర్ శీనయ్య, శివ, జనరల్ సెక్రటరీ పార్థసారథి, కోశాధికారి రేఖ, ప్రచార కార్యదర్శి లోకాచారి సురేష్ బాబు, ధరణి కుమార్, పూలహరికృష్ణ, జాయింట్ సెక్రటరి బాబ్జి, రూప్ సాగర్, జల్లా శివ ప్రసాద్, యుగంధర్ రెడ్డి, రమణ రెడ్డి, తులసమ్మ, మణికంఠ, రవి తదితరులు పాల్గొన్నారు.

About The Author