లాక్ డౌన్ ను సొమ్ము చేసుకుంటున్న హోటల్ యజమాని…


తిరుపతి రేణిగుంట మొత్తం కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ తో ఉదయం
11 గంటలకు అన్ని రకాల వ్యాపార సముదాయాలు మూతపడుతున్నాయి కానీ రేణిగుంటలో ఒక్క హోటల్ యజమాని మాత్రం ఇదే అదునుగా చేసుకొని హోటల్ తెరిచి విక్రయాలు చేస్తున్నాడు. అంతవరకు సరేలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే లాక్ డౌన్ ను అదునుగా చేసుకొని అధిక ధరలతో అమ్ముతూ సామాన్యులను నిలువునా దోచుకుంటున్నాడు.స్థానిక పోలీసులు వచ్చినప్పుడు మూసేసినటు నటిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు హోటల్ లో అమ్మకాలు సాగిస్తున్నాడు. పట్టణంలో అన్ని వ్యాపార సముదాయాలు మూతపడి ఉన్న కూడా ఇతను మాత్రం కరోనా ని లెక్కచేయడు.లాక్ డౌన్ విధించిన అధికారులను లెక్క చేయడం లేదు అనేందుకు ఈ ఫోటోనే నిదర్శనం. ఆదివారం సాయంత్రం ఎంత దర్జాగా హోటల్ తెరిచి అమ్మకాలు చేస్తున్నాడో చూడండి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న కొందరు ఇలాంటి వాళ్ళు చేస్తున్న పనులకు రోజు రోజుకి కరోనా పెరగదా ఉందే తప్ప తాగటం లేదు. లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు పట్టణవాసులు కోరుతున్నారు.

About The Author