బలాత్కారం చేసి.. తాళి కట్టాడు!బాలిక ఫిర్యాదు


జి.మాడుగుల(విశాఖ): కుంబిడిసింగి పంచాయతీకి చెందిన ఓ యువకుడు తనపై అత్యాచారం చేసి.. ఆపై తాళి కట్టాడని ఆరోపిస్తూ అదే పంచాయతీకి చెందిన బాలిక తల్లిదండ్రులతో కలిసి గురువారం జి.మాడుగుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 7న ఇంటి నుంచి ఒంటరిగా వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకుడు బలవంతంగా అరకులోయ తీసుకువెళ్లి లాడ్జిలో బంధించాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. భయంతో నీరసించి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేసి, తాళిబొట్టు కట్టాడని ఆరోపించింది. బాలిక ఫిర్యాదుపై సీఐ దేముడుబాబు మాట్లాడుతూ.. బాలిక సంతకంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇరువర్గాలను శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారణ అనంతరం వివరాలను వెల్లడిస్తామన్నారు.

About The Author