వంటిమామిడి మార్కెట్‌యార్డును సందర్శించిన సీఎం శ్రీ కేసీఆర్‌


సిద్దిపేట జిల్లా, ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం విక్రేతలతో మాట్లాడారు. కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

About The Author