బీజేపీపై పోరాటానికి కాంగ్రెస్‌లోకి వస్తానని ప్రకటన…


దేశవ్యాప్తంగా కుదేలై చచ్చి బతుకుతున్న కాంగ్రెస్‌ పార్టీ కొంత ఊరట కల్పించే పరిణామం చోటుచేసుకోనుంది. త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన్నే స్వయంగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం వస్తుందని గుజరాత్‌లో చర్చ నడుస్తోంది. ఆయన రాకతో హస్తం పార్టీలో జోష్‌ రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన శంకర్‌ సిన్హా వాఘేలా త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తనను కాంగ్రెస్‌లో చేరాలని ఇటీవల కార్యకర్తలు, అభిమానులు విజ్ఞప్తులు చేస్తున్నారని.. ఎక్కడకు వెళ్లినా అదే ప్రస్తావన వస్తోందని వివరించారు. ఎలాంటి షరతుల్లేకుండా హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.

About The Author