కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గుడ్‌బై


కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ వ్యవహారాలపై కొంత కాలంగా శ్రీశైలం గౌడ్ అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలం గౌడ్ మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు.
గత కొద్ది రోజులుగా శ్రీశైలం గౌడ్‌తో బీజేపీ ముఖ్యనేత డీకే అరుణ చర్చలు జరుపుతున్నారు. అవి సఫలం కావడంతో… తాజాగా తన నిర్ణయాన్ని శ్రీశైలం వెల్లడించారు. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లారు. ఈరోజు ఉదయం ఢిల్లీకి కూన శ్రీశైలం బయలుదేరారు. అక్కడే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. 2009లో కుత్బుల్లా‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా కూన శ్రీశైలం ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

About The Author