ఎన్టీఆర్-త్రివిక్రమ్-మీలో ఎవరు కోటీశ్వరుడు


ఈసారి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా రాబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం మే నుంచి టెలికాస్ట్ అవుతుంది.
అయితే ఒకటి రెండు నెలలు ముందుగా ఈ కార్యక్రమానికి ప్రచారం అవసరం కాబట్టి అందుకోసం ప్రచార చిత్రాలు రూపొందించే పని ప్రారంభమైంది.
ఈ మేరకు ఈ రోజు ఒక యాడ్ ను షూట్ చేసారు. ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ డైరక్షన్ లో ఎన్టీఆర్ ఈ యాడ్ షూట్ లో పాల్గోన్నారు. స్టార్ సంస్థ ఇచ్చిన ఐడియాను కాన్సెప్ట్ గా మార్చి, తన స్టయిల్ లో త్రివిక్రమ్ చిత్రీకరించారు.
అన్నపూర్ణ లో జరిగిన షూట్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు కు వున్న స్టాండర్ట్ గెటప్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ యాడ్ ను మార్చి చివరిలో విడుదల చేసే అవకాశం వుంది.
ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ అని అఫీషియల్ గా ప్రకటించలేదు. ఈ యాడ్ తోనే ఆ ప్రకటన రావచ్చు.

About The Author