బిక్షాటన పేరుతో బలవంతంగా డబ్బు డబ్బు వసూలు


బిక్షాటన పేరుతో బలవంతంగా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ఆరుగురు యువతులు ఘట్‌కేసర్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…గుజారాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన ఆరుగురు యువతులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ధర్మశాలవద్ద నివాసం ఉంటున్నారు. ఘట్‌కేసర్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డులో వచ్చిపోయే వాహన దారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఇది గమనించిన బాధితులు, స్థానికులు పోలీసు టోల్‌ ఫ్రీ 100కు కాల్‌ చేసి సమాచారం ఇచ్చారు. యువతులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.

About The Author