కాసేపట్లో పెళ్లి… షాకిచ్చిన వధువు.. కారణం తెలిసి హతాసులైన జనం


జిల్లాలో ఓ పెళ్లి సడన్‌గా ఆగిపోయింది.

తనకు ఇష్టం లేదంటూ వధువు షాకిచ్చింది.

ధర్మవరంకు చెందిన ఓ యువకుడికి ముదిగుబ్బకు చెందిన ఓ యువతితో పెళ్లి గురువారం తెల్లవారుజామున నిశ్చయమైంది.

కదిరిలో నృసింహుని ఆలయంలో జరగాల్సి ఉంది.

ఇరువైపుల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు ఆలయానికి వచ్చారు.

ఈలోగా పెళ్లి కుమార్తె తనకు పెళ్లి ఇష్టం లేదని..

అబ్బాయి ఐటీఐ చదివి ఎంటెక్ అని అబద్ధం చెప్పాడంది.

తాను బీటెక్ చదివానని తన మనసులో మాట చెప్పింది.

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని…

పెళ్లి వాయిదా వేసుకుందామని
చెప్పినా బలవంతంగా తాళి కడతానని బెదిరిస్తున్నాడని ఆమె కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పెళ్లి ఇష్టం లేదని ముందే ఎందుకు చెప్పలేదని..

తమకు అవమానంగా ఉందని పెళ్లికుమారుడితో పాటు బంధువు అన్నారు.

పెళ్లి కోసం ముందుగానే రూ.1.5 లక్షలు పెళ్లి కుమార్తె బ్యాంకు అకౌంట్కు జమ చేశామన్నారు.

ఆ డబ్బు ఇస్తే తన దారిన తాను వెళ్లిపోతానని ఆ యువకుడు తేల్చిచెప్పాడు.

ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని..

పెళ్లి కోసం ఇచ్చిన డబ్బుల విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అతను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

పెళ్లి మాత్రం ఆగిపోయింది.

About The Author