యాప్‌లో ఆనందయ్య మందు.. ఎవరూ కృష్ణపట్నం రావొద్దు.. కలెక్టర్


సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు సంజీవనిగా కనిపించింది. కరోనా సోకి పరిస్థితి విషమంగా ఉన్న వాళ్లలో కొందరు ఆనందయ్య మందు కారణంగానే తాము బతికామని.. అప్పటి దాకా వెంటిలేటర్‌పై ఉన్న తాను ఆనందయ్య మందు తీసుకున్న కొంత సమయానికే హ్యాపీగా కూర్చుని భోజనం చేయగలుగుతున్నానని చెప్పారు.

ఇలా కెమెరాల సాక్షిగా కొందరు పంచుకున్న అనుభవాలు ఆనందయ్య మందుపై ఆశలు రేకెత్తించాయి. బతుకు జీవుడా’ అంటూ కృష్ణపట్నానికి కరోనా బాధితులు క్యూ కట్టారు. అటు సోషల్ మీడియాలోనూ, ఇటు మీడియాలో ఆనందయ్య కరోనా మందుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

About The Author