సినీ నటి జయంతి ఆత్మకు శాంతి చేకూరాలి వైస్ ప్రెసిడెంట్

పలు దక్షిణాది చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి జయంతి(76) ఆదివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బెంగుళూరులోని ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. జయంతి మరణం గురించి తెలిసిన పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సినీ నటి జయంతి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను అని ట్వీట్ చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

”ప్రముఖ సినీ నటి జయంతి (కమలకుమారి) పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను.

చక్కని అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఆమె జాతీయ అవార్డును అందుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను..” అని వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

About The Author