ఈ నెల 14వ జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు
తిరుపతి 2026, జూలై,26ఈ నెల 14వ జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసాం. 12 లక్షల విలువైన ఆభరణాలతోపాటు హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. సాయినగర్ లో 60 సం.ల వృద్ధురాలు జ్యోతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఆంధ్ర బ్యాంక్ రిటైర్ ఉద్యొగి కృష్ణారెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్దురాలను హత్య చేసి నగలతో పరారయ్యాడు.
నిందితుడు నెల్లూరు రూరల్, గుడిపల్లి పాడు గ్రామానికి చెందిన రూపేష్ కుమార్ గా గుర్తించాం.మృతురాలి కుటుంబ సభ్యులతో పాత పరిచయం ఉంది.
రూపేష్ కుమార్ అనే వ్యక్తి రైల్వే శాఖలో లోకో పైలెట్ గా గత 15 సంవత్సరాలు విధులు.జల్సాలకు అలవాటు పడి, చేసిన అప్పులు తీర్చలేక ఓ పధకం ప్రకారమే జ్యోతి ని కిరాతకంగా హత్య చేశాడు.వృద్ధురాలు ఒంటిపై ఉన్న 12 లక్షల 90 వేలు విలువ చేసే, ఆభరణాలు తీసుకెళ్లాడు.
ఉద్దేశ్య పూర్వకంగా నేరం చేసాడు.
ద్విచక్రవాహనంపై వచ్చి, తనను గుర్తించకుండా ఉండేలా తలకు హెల్మెట్, ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని, ఆతర్వాత నల్లని బురఖా ధరించి పారిపోయాడు.
సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితున్ని గుర్తించడం కొంత సమయం పట్టింది.సాంకేతిక ఆధారాలతో నిందితున్ని పెట్టుకున్నాం.ఇండ్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే సెక్యూరిటీ ఉంటుందని తిరుపతి ప్రజలకు సూచన.తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు.
