సింగరేణి కార్మికులకు శుభవార్త

సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది సింగరేణి బోర్డ్‌. పదవీ విరమణ వయస్సు 61 యేండ్లకు పెంపు పై ఇవాళ సింగరేణి భవన్ లో సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన బోర్డ్ సమావేశం అయింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో పదవి విరమణ వయస్సు 61 యేండ్లకు పెంచుతూ ఈ సందర్భంగా సింగరేణి బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక పెంచిన వయస్సు మార్చి 31, 2021 నుండి అమల్లోకి వస్తుందని సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. మార్చి 31 జూన్ 30వ తేదీ మధ్య కాలంలో రిటైర్మెంట్ తీసుకున్న 39 అధికారులు, 689 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోనుంది సింగరేణి సంస్థ. పదవీ విరమణ వయస్సు 61 యేండ్ల పెంపుతో మొత్తం సింగరేణి అధికారులు, కార్మికులు 43 వేల 899 మంది కి లబ్ది చేకూరుతుందని ఆయన ప్రకటించారు.

తాజాగా తీసుకున్న పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తీసుకు వస్తున్నట్లు సీఎండీ శ్రీధర్ స్పష్టం చేశారు. ఇటీవలే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును పెంచాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

About The Author