ఏపీలో ఆగస్టు 14వరకు కర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆగస్టు 14వరకు కర్ఫ్యూని పొడిగిస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 10 నుంచి ఉదయం 6వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీ, సీపీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

About The Author