శ్రీమతి ఆర్.కె. రోజా గారికి పూలాభిషేకం

చిత్తూరు జిల్లా:వడమాలపేట స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి ఆర్.కె. రోజా  సోమవారం వడమాలపేట మండలం తట్నేరి నందు ఆసియన్ అభివృద్ధి బ్యాంకు నిధులు 43 లక్షల రూపాయలతో నిర్మించిన పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి  నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు ను ప్రారంభించి వైఎస్సార్ జగనన్న కాలనీల గృహనిర్మాణం కోసం నిరుపేదలైన లబ్దిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా ఒకొక్కరికి 30 వేల రూపాయల వంతున ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె.రోజా  పంపిణీ చేశారు.

పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి  నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణంను ఆసియన్ అభివృద్ధి బ్యాంకు ద్వారా   చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే  ఆర్.కె.రోజాని స్థానికులు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు. అనంతరంనగరి గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి ఆర్.కె.రోజా గారు వడమాలపేట మండలం అప్పలాయగుంటలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం *వైయస్సార్ పచ్చతోరణం* పధకం లో బాగంగా అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో సోమవారం పాల్గొని మొక్కలు నాటారు.  మొక్కల పరిరక్షణకు వాచర్స్ ను నియమించి మొక్కల పెరుగుదల భాధ్యతలు,  ఆదేశాలను, సూచనలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లికార్జున్, తాహసిల్దార్ భార్గవి, వై ఎస్ ఆర్ సి పి చిత్తూరు జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి చుక్క శేఖర్, సదాశివ కోన చైర్మన్ ముని బాబు,  అప్పలాయగుంట సర్పంచ్ శేషాద్రి రెడ్డి, ఎల్. యం. కండ్రిగ సర్పంచ్ ధర్మయ్య మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

About The Author