మోసపోయిన సినీ నటి పవిత్రా లోకేశ్‌..!

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేశ్‌ను ఆమె మేనేజర్ ఆర్థిక లావాదేవీల్లో మోసం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 60 లక్షలకు పైగా జీఎస్‌టీ చెల్లింపులు చేయలేదని.. దీంతో ప్రభుత్వం నుంచి పవిత్రా లోకేశ్‌కు నోటీసులు అందాయని టీటౌన్ లో వార్తలు రౌండ్ అవుతున్నాయి. గతంలో సినీ సెలబ్రిటీలు ఎందరో ఇటువంటి మోసాలకు గురయ్యారు. కెరీర్లో బిజీగా ఉండి ఆర్థిక లావాదేవీలను మేనేజర్లను నమ్మి అప్పగించి కోట్లు కోల్పోయిన సెలెబ్రిటీల ఉదంతాలెన్నో జరిగాయి.

ఇప్పుడు పవిత్ర లోకేశ్ కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఆమధ్య అనసూయ కూడా జీఎస్టీ పన్నులు, ఆదాయ వ్యవహారాలన్నీ తన మేనేజర్ చూసుకునేవాడని..

కానీ తనకు నోటీసులు వచ్చాక మోసపోయానని తెలిసి వాటిని కట్టేశానని అనసూయ చెప్పుకొచ్చింది. ఎందరో సెలబ్రిటీలు కొందరు మేనేజర్లు చేసిన మోసాలకు అప్పులపాలైన సంఘటనలు కూడా ఉన్నాయి.

About The Author