కాబోయే అల్లుడికి 365 వంటలతో….. ఆతిథ్యం


పశ్చిమగోదావరి జిల్లా : /
నరసాపురం

కాబోయే అల్లుడికి 365 వంటలతో నరసాపురంలో తాతయ్య ఆతిథ్యం . వివరాల్లోకి వెళితే ….

తణుకు బుల్లోడికి భీమవరం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. త్వరలో వీరి పెళ్లి

తణుకు తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం అన్నపూర్ణ దంపతుల కుమారుడు తుమ్మలపల్లి సాయికృష్ణ ను భీమవరం వెంకట్రామా టాకీస్ ఎదుట విజయలక్ష్మి జ్యూయలర్స్ అధినేత అత్యం వెంకటేశ్వరావు మాధవిల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కుమారి కుందవి ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి ముందే పెద్ద పండుగ రావడంతో పెళ్లి కుమార్తె తాతయ్య గారు ఆచంట గోవింద్ నాగమణి దంపతులు ఈ విధంగా కాబోయే నూతన వధూవరులకు నరసాపురంలో ఆతిథ్యం సంక్రాంతి నాడు ఇచ్చారు. తాడేపల్లిగూడెం , బాదంపూడి NK గ్రానైట్స్ అధినేత ఆర్య వైశ్య సంఘం జిల్లా నాయకులు మిత్రులు కారుమూరి రవి లక్ష్మి దంపతులు ఇంకా బంధుగణం ఈ సంక్రాంతి సందడిలో పాల్గొన్నారు. కారుమూరి రవి తోడల్లుడు కుమారుడే ఈ పెళ్ళికొడుకు

About The Author