భారత్ లో కొత్తగా 2,568 కరోనా కేసులు నమోదు..


ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. తాజాగా నమోదు అవుతున్న కేసుల లెక్కలు చూస్తే. ఇండియాలో కరోనా ఖతం అయిపోయినట్లే అనిపిస్తోంది.ఇండియాలో ఇప్పటికే భారీగా తగ్గి పోయాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2568 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,96,062 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 33,917 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89. 11 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 97 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,15,974 కి చేరింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,80,40,28,891 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 19,64,423 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4722 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,24,46,171 కు చేరింది.

About The Author