సమస్త మానవాళి సుబిక్షం కొరకు కార్తీక మహా దీపం


రామచంద్రపురం మండలం యోగుల పర్వతంపై కార్తీక దీపం ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీచె వెలిగించారు . సాయంత్రం 6 గంటలకు 1550 కిలోల ఆవు నెయ్యి తో సుమారు 30 కిలోమీటర్లు కనిపించే మేరా కార్తీకదీపం ను వెలిగించారు . ఉదయం నుండి యోగుల పర్వతంపై ఉన్న శ్రీ సిద్దేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలాగే సుబ్రహ్మణ్యం స్వామికి నాగదేవతలకు పూజలు చేశారు . ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు కొరకు పలువురిచే భజనలు చేశారు . ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు యోగులు పర్వతం పైకి వచ్చే భక్తులకు దారి పొడుగునా త్రాగునీరు, పర్వతంపై నిత్య అన్నదాన కార్యక్రమం జరిగింది . భక్తులందరూ ఈ యొక్క కార్తీక దీపం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు

About The Author