సంగారెడ్డి జిల్లాలో పోలీసు సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు.. బకాయిల చెల్లింపుల ఆలస్యం
ప్రభుత్వం నుంచి రావాల్సిన టీఏ బిల్లులు (Travelling Allowances) మరియు సరెండర్ లీవ్ బకాయిలు చాలా కాలంగా విడుదల కాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పోలీసులు
సంగారెడ్డి జిల్లాలో పోలీస్ విభాగానికి సంబంధించి రూ.11.34 కోట్లు టీఏ బిల్లులు, రూ.24 కోట్లు సరెండర్ లీవ్ అమౌంట్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం
మొత్తంగా, ఒక్కొక్క పోలీస్ సిబ్బందికి సగటున రూ.94,500 చొప్పున బకాయిలు రావాల్సి ఉందని తెలిపిన అధికారులు
ఇక ఇంధన భత్యాలు, యూనిఫామ్ అలవెన్సులు, హౌస్ రెంట్ అలోవెన్స్ల చెల్లింపులు కూడా ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న పోలీసులు
ఈ విషయమై పోలీసులు పలుమార్లు పై అధికారులకు, జిల్లా కార్యాలయానికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. పండగల వేళ కూడా ఈ బకాయిల చెల్లింపులు జరగకపోవడంతో కుటుంబ ఖర్చులు భరించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్న పోలీసులు