
నిన్న దొంగ నోట్ల గురించి చదివారు కదా! నేడు బాంబు దాడులు గురించి చదివి ధురంధర్2 చూడండి.
2004 ముందు జరిగినట్లుగా దేశంలో పెద్ద నగరాల్లో బాంబు దాడులు భారీ ఎత్తున జరగలేదు అని పోస్ట్స్ పెడితే పుల్వామా లో జరగలేదా? పఠాన్ కోట్ లో జరగలేదా అంటూ మోడీ ద్వేషులు లాజిక్ లు తీస్తున్నారు.
2014 ముందు కూడా ఆ 10 సం.లలో బార్డర్ జిల్లాల్లో భారీ ఎత్తున టెర్రర్ దాడులు జరిగాయి. వాటితో పాటు దేశం నడి బొడ్డున ఉండే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, అహమ్మదాబాద్, వారణాసి వంటి అతి ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా ఒకే నగరంలో రెండు మూడు దాడులు జరిగాయి.
పుల్వామా పఠాన్ కోట్ దాడులను ముంబై హైదరాబాద్ వంటి చోట దాడులను ఒకే గాట కడుతున్నారు అంటే వాళ్ళకు మోడీ మీద ద్వేషం ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోండి.
మరి వాళ్ళు రోజూ లోకల్ ట్రైన్స్ లో పుల్వామా ఆఫీస్ కి వెళ్తారా? వాళ్ళ భార్యలు పఠాన్ కోట్ సాయిబాబా గుడికి, వాళ్ల కాలేజి పిల్లలు కాశ్మీర్ లో గోకుల్ చాట్ కి వాళ్ళ చిన్న పిల్లలు శ్రీనగర్ లుంబిని పార్క్ కి వెళ్తారేమో నాకు తెలియదు. మేం మాత్రం దేశం నడి బొడ్డున ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో అని భయం లేకుండా గతంలో కంటే అతి భద్రంగా జీవిస్తున్నాం.
2004-14 మధ్య ముఖ్యమైన బాంబు దాడుల లిస్ట్ క్రింద ఇచ్చాను. ఇది ఎవరి పాపం? వీటి వెనుక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారు అని తెలిసినా గట్టి చర్యలు ఎందుకు తీసుకోలేదు?
2014 తర్వాత ఈ బాంబు దాడులకు కారణమైన వారిని పాక్ లో గుర్తు తెలియని వాళ్ళు ఎలా లేపేశారు? ఒక్కొక్కడిని లేపేయడం #ధురందర్2
లో ప్రేక్షకులు కళ్లారా చూస్తూ ఉద్వేగం పొందుతూ ఉంటే ఈ సినిమాను ప్రాపగండా సినిమా అంటున్నారు అంటే వారి కుటుంబ సభ్యులు, దగ్గర వారు ఎవరూ బాంబు దాడుల్లో పోవడం తీవ్రంగా గాయపడటమో జరగలేదు అన్న మాట.
2004-14 మధ్య మన్మోహన్ సారధ్యంలో పక్కా సెక్యులర్ ప్రభుత్వం ఉండేది. దాన్లో మళ్ళీ పక్కా ఎర్ర భావజాలం మరియు మైనార్టీ భావజాలం, హిందూ ద్వేషం గల ఒక గుంపుని సోనియా గాంధీ ఆధ్వర్యంలో తయారుచేసి దానికి “నేషనల్ అడ్వైజరీ కమిటీ” లేదా NAC అని పేరు పెట్టి ఆ ముఠాలో అరుణా రాయ్, హర్ష మందర్, బ్రెజిలియన్ అవాంజ్ లిస్ట్ జాన్ డ్రెజ్, శామ్ పిట్రోడా,అల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జాన్ దయాల్ వంటి వారిని నియమించారు. ప్రధాని మరియు మంత్రి మండలి ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ఏ చట్టాలు చేయాలి అనేది ఈ ముఠా శాసించేది.
అంటే ఆ 10 సం. లు.పూర్తిగా అసలు సిసలైన హిందూ ద్వేష సెక్యులర్ ప్రభుత్వం ఉండేది. మరి అటువంటి సెక్యులర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారత్ లో ఇస్లాం కి ప్రమాదం లేదు. అలాగే దేశంలో ముస్లింలకు ప్రమాదం లేదు. ఆ పరిస్థితుల్లో పాక్ వంటి ఇస్లామిక్ దేశం ఏం చేయాలి? భారత్ లో సెక్యులర్ ప్రభుత్వం హయాంలో తన దేశ ఇస్లామిక్ ఉగ్రవాదులు చే దాడులు జరగకుండా చూడాలి. సెక్యులర్ ప్రభుత్వానికి మచ్చ రాకుండా చూడాలి. కానీ, జరిగింది ఏమిటి?
ఈ ఉదార సెక్యులర్ ప్రభుత్వాన్ని పాక్ ఒక చవట ప్రభుత్వం గా తీసుకుని భారత్ ఇస్లామిక్ ఉగ్రవాద దాడులతో భారత్ లో గల అన్ని పెద్ద నగరాలను గడగడ లాడించి వేల మంది చావులకు గాయాలకు కారణం అయింది.
2008లో 26/11 దాడుల్లో మన దేశ ఆర్ధిక వెన్నుముక అయిన ముంబై ని లక్ష్యం గా చేసుకుని ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేసి వందల మంది ప్రాణాలు తీశారు. దేశం నడి బొడ్డున, దేశ ఆర్ధిక రాజధాని మీద దాడి అంటే ఇది మన దేశం మీద ప్రత్యక్ష యుద్ధమే. అందువల్ల మనం ప్రతీకార దాడులు చేద్దాం అని అప్పటి ఆర్మీ చీఫ్ మన్మోహన్ ని అడిగితే అనుమతి ఇవ్వలేదు. కారణం? పాక్ పై దాడులు వద్దు అని అమెరికా వత్తిడి చేసింది అని ఈ మధ్య మాజీ హోమ్ మంత్రి చిదంబరం చెప్పారు.
కానీ, 26/11 వెంటనే పాక్ మీద భీకర దాడులు చేసి ఉంటే ప్రపంచం అంతా మన వెనుక నిలిచి ఉండేది. పాక్ కి శాశ్వతంగా బుద్ది వచ్చేటట్లు చేసి వుండేవారం. ఒక బంగారు అవకాశం వదిలేశాం. అందుకే 2008 తరువాత కూడా 2014 వరకు పాక్ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత్ లో వారికి నచ్చిన నగరంలో నచ్చిన సమయంలో దాడులు చేసి భారీ ప్రాణ,ఆస్తి నష్టం కలుగచేశారు.
అయినా ఏ నాడూ పాక్ మీద దాడి చేయమని మన సాధారణ ప్రజలు ప్రభుత్వం పై వత్తిడి తేలేదు.
అయితే, మన సామాన్య జనాలకు జ్ఞాపక శక్తి తక్కువ. ఆ దాడులు అన్ని మరిచిపోయాం.
2014 తరువాత దేశం నడిబొడ్డు నగరాల్లో ఎక్కడా పెద్దగా బాంబు దాడులు జరిగి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మొన్న కాశ్మీర్ లో పుల్వామా యాత్రికుల మీద దాడి తర్వాత ప్రభుత్వం ఏం చేయడం లేదు అని మాత్రం ప్రశ్నిస్తుంటాం.
ఒక సారి మీ అందరికీ గుర్తు చేయడానికి, 2004-14 మధ్య దేశం నడి బొడ్డు నగరాల్లో సామాన్య ప్రజలు ఎలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారో మళ్ళీ మనం గుర్తు చేసుకోవడానికి వీలుగా …
ఇక్కడ 2004 నుండి 2014 వరకు భారతదేశంలో జరిగిన ముఖ్యమైన ఇస్లామిక్ ఉగ్రవాద దాడుల సంక్షిప్త జాబితా ఇస్తున్నాను.
1) 15 ఆగస్టు 2004, ధేమాజీ, అస్సాం: కళాశాల పరేడ్లో బాంబు; 18 మంది మరణం, 40+ మంది గాయాలు.
2) 2 అక్టోబర్ 2004, డిమాపూర్, నాగాలాండ్: రైల్వే స్టేషన్ మరియు మార్కెట్లో రెండు బాంబు దాడులు; 30 మంది మరణం, 100+ మంది గాయాలు. NSCN హిజిబుల్లా మూహిద్దీన్ కారణం.
3) 29 అక్టోబర్ 2005, ఢిల్లీ: మార్కెట్లలో (పహర్గంజ్, సరోజినీ నగర్) మరియు బస్సులో మూడు చోట్ల బాంబులు; 63 మంది మరణం, 210 మంది గాయాలు. చేసింది: ఇస్లామిక్ రివల్యూషనరీ ఫ్రంట్
4) 28 డిసెంబర్ 2005, బెంగళూరు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కాల్పులు; ఒకరు మరణం, 4 మంది గాయాలు. లష్కర్-ఎ-తోయిబా (LeT)
5) 7 మార్చి 2006, వారణాసి, ఉత్తర ప్రదేశ్ లో ఆలయం మరియు రైల్వే స్టేషన్లో రెండు బాంబులు; 21 మంది మరణం, 60+ మంది గాయాలు. LeT
6) 11 జులై 2006, ముంబై: లోకల్ రైళ్లల్లో 7 బాంబు దాడులు; 209 మంది మరణం, 700+ మంది గాయాలు. LeT మరియు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI) సంబంధం.
7) 25 ఆగస్టు 2007, హైదరాబాద్: లుంబిని పార్క్ మరియు గోకుల్ చాట్ లో రెండు బాంబులు; 42 మంది మరణం, 60+ మంది గాయాలు. హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామీ (HuJI) మరియు LeT అనుమానం.
8) 13 మే 2008, జైపూర్, రాజస్థాన్: మార్కెట్లలో తొమ్మిది చోట్ల బాంబు దాడులు; 63 మంది మరణం, 200+ మంది గాయాలు. HuJI, LeT, మరియు SIMI సంబంధం.
9) 26 జులై 2008, అహ్మదాబాద్, గుజరాత్ లో మార్కెట్లు మరియు ఆసుపత్రులలో 21 చోట్ల బాంబు దాడులు; 56 మంది మరణం, 200+ మంది గాయాలు. ఇండియన్ ముజాహిద్దీన్ (IM)
10) 13 సెప్టెంబర్ 2008, ఢిల్లీ: మార్కెట్లలో ఐదు చోట్ల బాంబు దాడులు; 30 మంది మరణం, 100+ మంది గాయాలు. IM బాధ్యత స్వీకరించింది.
11) 26 నవంబర్ 2008, ముంబై: హోటళ్లు, రైల్వే స్టేషన్, మరియు ఇతర స్థలాలపై ఒకేసారి పలు బాంబు దాడులు; 166 మంది మరణం, 293 మంది గాయాలు. LeT నిర్వహించింది, హఫీజ్ సయీద్ మాస్టర్మైండ్.
12) 13 ఫిబ్రవరి 2010, పూణే, మహారాష్ట్ర: జర్మన్ బేకరీలో బాంబు; 17 మంది మరణం, 60+ మంది గాయాలు. IM మరియు LeT.
13) 7 డిసెంబర్ 2010, వారణాసి, ఉత్తర ప్రదేశ్: షీత్లా ఘాట్లో బాంబు పేలుడు. ఇద్దరు మరణం, 20+ మంది గాయాలు. IM బాధ్యత స్వీకరించింది.
14) 13 జులై 2011, ముంబై: మార్కెట్లలో మూడు చోట్ల బాంబు దాడులు; 26 మంది మరణం, 130+ మంది గాయాలు. IM మరియు LeT
15) 7 సెప్టెంబర్ 2011, ఢిల్లీ: హైకోర్టు గేట్ వద్ద బాంబు దాడి; 15 మంది మరణం, 70+ మంది గాయాలు. HuJI బాధ్యత స్వీకరించింది.
16) 25 ఆగస్టు 2012, బోధ్ గయా, బీహార్: బౌద్ధ స్థలాల వద్ద తక్కువ తీవ్రత బాంబులు; 10 మంది మరణం, 5 మంది గాయాలు. IM వెనుక.
17) 21 ఫిబ్రవరి 2013, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ సాయి బాబా గుడి వద్ద రెండు బాంబు దాడులు; 18 మంది మరణం, 100+ మంది గాయాలు. IM బాధ్యత.
18) 17 ఏప్రిల్ 2013, బెంగళూరు: బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు; 5 మంది మరణం, 16 మంది గాయాలు. IMపై అనుమానం.
19) 7 జులై 2013, బోధ్ గయా, బీహార్: మహాబోధి ఆలయంలో సీరియల్ బాంబులు; 2 మంది మరణం, 5 మంది గాయాలు. IM సంబంధం.
20) 27 అక్టోబర్ 2013, పాట్నా, బీహార్: మోడీ ర్యాలీలో సీరియల్ బాంబు దాడులు; 6 మంది మరణం, 80+ మంది గాయాలు. IM బాధ్యత స్వీకరించింది.
21) May, 1 చెన్నై ట్రైన్ బ్లాస్ట్స్. ఒక మహిళ మృతి. పలువురికి గాయాలు
2004 నుండి 2014 వరకు జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాద చర్యల ఆధారంగా:
మొత్తం అధికారికంగా మరణించినవారు: సుమారు 750
మొత్తం గాయపడినవారు: సుమారు 2,250.
నగరాలు: (కొన్ని నగరాలు అంటే ఢిల్లీ, ముంబై, వారణాసి బెంగుళూరు, హైదరాబాద్ వంటి చోట్ల ఆ 10 సం.లలో ఒకటికి మించి ఎక్కువ దాడులు జరిగాయి)
ఢిల్లీ
ముంబై
బెంగళూరు
వారణాసి
అహమ్మదాబాద్
హైదరాబాద్
జైపూర్
పూణే
పాట్నా
గయ
చెన్నై
పైన చెప్పినవి కాకుండా ఒక్క జమ్మూకాశ్మీర్ లో చూసుకుంటే….
2004-14 మధ్య మన్మోహన్ పాలనలో 7,217 సంఘటనలు జరిగి 2829 మంది పౌరులు మరియు భద్రతా దళాలు వారు చనిపోగా ఎన్ని వేల మంది గాయపడ్డారో లెక్కలేదు.
అదే జమ్మూకాశ్మీర్ లో 2014-2024 మధ్య మోదీ పాలనలో 2242 సంఘటనలు జరిగి 915మంది పౌరులు మరియు భద్రతా సిబ్బంది చనిపోయారు. అంటే సుమారుగా 70% బాంబు దాడులు దానికి చెందిన మరణాలు తగ్గాయి.
అయినా, మోదీ మొహం నచ్చలేదు.
మేం, మా బంధువులు, స్నేహితులు దేశంలో
నడిబొడ్డున ఉన్న నగరాల్లో ఉగ్రవాదుల బాంబు దాడుల్లో చావడానికి కూడా సిద్ధపడతాం కానీ మోదీ బెటర్ పాలకుడు అంటే చచ్చినా ఒప్పుకోమ్.
ఈ దాడులకు కారణమైన వారిని ఎలా లేపేసారో #ధురంధర్2 లో మళ్ళీ మళ్ళీ చూసి గుర్తు పెట్టుకోండి.
