జొన్న రొట్టె చరిత్ర, గొప్పతనం మరియు ఆరోగ్య ప్రయోజనాలు…

మీకు తెలుసా తెల్ల బియ్యం వచ్చిన తరువాతనే మనలో షుగర్ వ్యాధి ఎక్కువగా వచ్చింది అది ఎలానో పూర్తిగా చదవండి మన పిల్లలకు తెలియజేయండి…
భారతీయ ఆహారపు అలవాట్లలో జొన్న రొట్టెకు ప్రత్యేక స్థానం ఉంది.
జొన్నలు ప్రపంచంలోని అత్యంత పురాతన ధాన్యాలలో ఒకటి మన భారత దేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో జొన్నలు ప్రధాన ఆహారంగా ఉండేవి.
ఇప్పుడైతే తెల్ల బియ్యం (White Rice) ఎక్కువగా వాడుతున్నారు కానీ ఒకప్పుడు కరువు ప్రాంతాల్లో ఎక్కువగా జొన్నలే పండేవి
ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్ర కరువు ప్రాంతాలుగా ఉండేది అప్పుడు జొన్న పంటకుతక్కువ నీరు తీసుకొని ఎండలను తట్టుకుని పెరుగుతుంది సులభంగా పండుతుంది
అందుకే అప్పట్లో చాలామంది ఇళ్లలో జొన్న రొట్టెలు,రాగి సంగటి,సజ్జ ఆహారం వంటి సహజ ధాన్యాలే ప్రధాన ఆహారం అయ్యేవి.
ఎనకట పేదవారి ఇంట్లో బియ్యం వండాలి అంటే…అది పండగ రోజు అయి ఉండాలి లేదా ప్రత్యేక సందర్భం అయి ఉండేది
బియ్యం ఎక్కువగా ధనిక కుటుంబాల్లోనే తినే ఆహారంగా భావించేవారు.మన దివంగత నేత N. T. Rama Rao గారు రెండు రూపాయల కిలో బియ్యం పథకం తీసుకురాకముందు చాలామందికి బియ్యం అంత సులభంగా అందుబాటులో ఉండేది కాదు.
జొన్నలలో ఎక్కువగా Fiber ఉంటుంది ఇది జీర్ణానికి తేలికగా ఉండటమే కాకుండా ఎక్కువసేపు ఆకలి వేయకుండా సహాయపడుతుంది.
ఇది గ్లూటెన్ రహిత ధాన్యం కావడంతో షుగర్ ఉన్నవారు చాలామంది ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తున్నారు
ఈరోజు scientists కూడా అదే చెబుతున్నారు…జొన్నలు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయని
అందువల్ల మధుమేహం (Diabetes) ఉన్నవారికి కూడా జొన్న రొట్టె మంచి ఆహారంగా భావిస్తారు బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
*ఒకప్పుడు పేదవారి ఆహారం అని చూసిన జొన్న రొట్టె…ఈరోజు ప్రపంచం “Healthy Food”గా గుర్తిస్తోంది*
*ఈరోజు మీ పిల్లలకు చెప్పండి:*
“మన పెద్దలు ఎందుకు జొన్న రొట్టె తినేవారు?”
*రేపటి విషయం📍*
*అరటి ఆకు మీద భోజనం ఎందుకు చేసేవారు*
*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
*Dr. వెంకటేశ్వరరావు 8886061117*
